ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ పీఆర్వో నుశ్రత్‌.ఎం.మండ్రూప్‌కర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెంబరు (07053) సికింద్రాబాద్‌ – కాకినాడటౌన్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 11వ తేదీ రాత్రి 9.40కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.40కు కాకినాడటౌన్‌  చేరుతుంది. రైలునెంబరు (07054)  కాకినాడటౌన్‌ – సికింద్రాబాద్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 13వ తేదీ రాత్రి 8 గంటలకు కాకినాడటౌన్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.40కు సికింద్రాబాద్‌ చేరుతుంది. రైలునెంబరు (07255) నరసాపూర్‌– సికింద్రాబాద్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 10,12వ తేదీలలో రాత్రి 6 గంటలకు నరసాపూర్‌లో బయలుదేరి మరుసటిరోజు తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్‌  చేరుతుంది.
రైలునెంబరు (07256) సికింద్రాబాద్‌–నరసాపూర్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 11వ తేదీ రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.05కు నరసాపూర్‌ చేరుతుంది. రైలునెంబరు(07255) నరసాపూర్‌ – సికింద్రాబాద్‌  ప్రత్యేకరైలు అక్టోబర్‌ 13వ తేదీ రాత్రి 8.50కు నరసాపూర్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.50కు సికింద్రాబాద్‌ చేరుతుంది. ఈ ప్రత్యేకరైళ్లు విజయవాడ మీదుగా రాక, పోకలు సాగిస్తాయని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీఆర్వో తెలిపారు. 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: