నిరుద్యోగులకు ఈస్ట్రన్ రైల్వే తీపికబురు అందించింది. తాజాగా ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ లో గ్రూప్ సి లెవెల్ 2 టెక్నిషియన్ల పోస్టులను భర్తీ చేయనుంది. అయితే అర్హులైన అభ్యర్థులు అంత ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసేందు చివరి తేదీ డిసెంబర్ 1, 2019గా పేర్కొంది.
కాగా ఈస్ట్రన్ రైల్వేస్ సంస్దలో 21 టెక్నీషియన్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. జాబ్ చెయ్యాల్సిన స్థలం కోల్కత్త, పశ్చిమ బెంగాల్. 10 తరగతి విద్యార్హతతో పాటు ఐటిఐ కూడా ఉండాలి. కాగా వయసు 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఈ ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
అయితే అప్లికేషన్ ఫీజు.. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.250/- ఉండగా ఇతరులకు రూ.500/- ఉంది.
అయితే అప్లికేషన్ ఫీజు.. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.250/- ఉండగా ఇతరులకు రూ.500/- ఉంది.
అయితే ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 1, 2019 నుంచి ఆరంభమై డిసెంబర్ 1, 2019 నాటికి ముగుస్తుంది. కాగా ఈ ఉద్యోగాలకు సంబంధించి మరింత సమాచారం కోసం https://er.indianrailways.gov.in/ ఈ వెబ్సైట్ ను సంప్రదించి తెలుసుకోండి. కాగా 10వ తరగతితో ఐటిఐ చదువు ఉన్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 1 ప్రారంభమవుతుంది.
https://er.indianrailways.gov.in/
Post A Comment:
0 comments: