ఉచిత కాల్స్​, తక్కువ ధరకే డేటా అందిస్తూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో... ఇక నుంచి కాల్​ ఛార్జీలు వసూలు చేయనుంది. ఇతర నెట్​వర్క్​లకు చేసే కాల్స్​పై నిమిషానికి 6 పైసలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది ఆ సంస్థ. నేటి నుంచి రీఛార్జ్​ చేసే వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది.
ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ను ఉచితంగా అందిస్తూ కేవలం డేటాకు మాత్రమే ఛార్జ్‌ చేస్తున్న రిలయన్స్‌ జియో తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే అవుట్‌గోయింగ్‌ కాల్స్‌కు ఛార్జ్‌ చేయాలని నిర్ణయించింది. ఇకపై రిలయెన్స్‌ జియో నుంచి ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌-ఐడియాకు కాల్‌ చేస్తే నిమిషానికి 6 పైసలు చెల్లించాలని రిలయెన్స్‌ జియో పేర్కొంది. అయితే ఆ మొత్తానికి సమానమైన ఉచిత డేటాను వినియోగదారులకు అందించనుంది జియో.జియో నుంచి జియోకు, ల్యాండ్​ లైన్​, వాట్సప్​, ఫేస్​టైమ్​, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా చేసే కాల్స్​కు ఇది వర్తించదని పేర్కొంది రిలయన్స్. అన్ని నెట్​వర్క్​ల నుంచి ఇన్​కమింగ్​ కాల్స్​ ఎప్పటిలానే ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది.నేటి నుంచి రీఛార్జ్​ చేసుకునే వినియోగదారులందరికీ ఈ నిబంధనలు వర్తించనున్నాయి.ట్రాయ్​ నిబంధనలతో ప్రత్యర్థి నెట్​వర్క్​లకు జియో సుమారు రూ.13,500 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఈ నష్టాన్ని భరించేందుకే ఇతర నెట్​వర్క్​లకు చేసే కాల్స్​పై 6 పైసలు వసూలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది సంస్థఐయూసీ ఛార్జ్​..ప్రస్తుతం ట్రాయ్‌ నిబంధనల ప్రకారం టెలికం సంస్థలు ఇంటర్‌కనెక్ట్ యూసేజ్‌ ఛార్జ్‌ (ఐయూసీ)ని చెల్లించాల్సి వస్తోంది. 2017లో ఈ ఐయూసీని ట్రాయ్​ 14 పైసల నుంచి 6 పైసలుకు తగ్గించింది. ఐయూసీ 2020 జనవరి వరకు కొనసాగుతుందని అప్పట్లో పేర్కొంది. అనంతరం అది రద్దవుతుందని వెల్లడించింది. అయితే తాజాగా ఆ గడువును పొడిగించాలా లేదా అనే దానిపై ట్రాయ్‌ సంప్రదింపులు ప్రారంభించింది

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: