ప్రస్తుత టెక్నాలజీ లో దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగిస్తున్న ఏకైక సోషల్ మీడియా సాధనం వాట్సప్. గతంలో ఫేస్ బుక్ లో ఉండిపోయే చాలా మంది ఇప్పుడు వాట్సప్ లో అధిక సమయం వెచ్చిస్తున్నారు. రోజు వారి వ్యాపార , ఉద్యోగ కార్యకలాపాలు సైతం వాట్సప్   నుంచీ సాగుతుండటంతో రోజు రోజుకి వాట్సప్  వాడే వారి సంఖ్య అధికమవుతోంది. ఈ క్రమంలోనే వాట్సప్ కాలానికి తగ్గట్టుగా కొత్త కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా అందుబాటులోకి రానున్న ఫీచర్ అద్భుతంగా ఉంటుందని అంటునారు టెక్ నిపుణులు.
వాట్సప్ లో మనం పంపే మెసేజ్ లని డెలీట్ చేసుకునే సౌకర్యం ఉంది. ఇప్పటికే ఈ ఫీచర్ ఎంతో మందికి ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఆదరణ పొందింది. అయితే త్వరలో రానున్న లేటెస్ట్ ఫీచర్ లో మాత్రం మెసేజ్ చేసిన 5 సెకన్ల నుంచీ గంట వరకూ కనిపిస్తాయి ఆ తరువాత ఆటోమేటిక్ గా డెలీట్ అయిపోతాయి.
ఇలాంటి సెట్టింగ్ వాట్సప్ లోకి  త్వరలో రానుంది. అందకుగాను వాట్సప్  లో సెట్టింగ్స్ విభాగంలో అందచేసే డిసప్పియర్ మెసేజ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇందులో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని  సంస్థ తెలిపింది. ఈ లేటెస్ట్ ఫీచర్ కూడా యూజర్స్ కి ఎంతో నచ్చుతుందని ప్రయోగాత్మకంగా నిర్దారించుకుంది వాట్సప్ . త్వరలో వాట్సప్   యూజర్స్ అందరికి అందుబాటులోకి రానుందని సంస్థ తెలిపింది.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: