INNER POST ADS

TRENDING NOW



ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగాల జాతరను కొనసాగిస్తోంది. రాష్ట్రంలో మరో ఉద్యోగాల ప్రకటన వెలువడింది. ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ల నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 19,170 వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన పూర్తి వివరాలను వెల్లడించారు.
మొత్తం 19,170 వార్డు వాలంటీర్ల ఖాళీలు భర్తీ
నవంబర్ 1 నుండి భర్తీ ప్రక్రియ ప్రారంభం
నవంబర్ 10 వరకు అభ్యర్థులు నుండి దరఖాస్తులు స్వీకరణ
నవంబర్ 15 వరకు దరఖాస్తులు పరిశీలన
నవంబర్ 16 నుండి 20 వరకు ఇంటర్వ్యూ లు
నవంబర్‌ 22న ఎంపికయిన వార్డు వాలంటీర్ల జాబితా ప్రకటన
డిసెంబర్ 1నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి



మాం సాహారంలో మాదిరిగా ప్రొటీన్‌, చేపల్లో మాదిరిగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శాకాహారంలో ఉండవు. అలాగని చింతించాల్సిన పనిలేదు. రోజుకు నాలుగు అక్రోట్లు (వాల్‌నట్స్‌) తింటే చాలు. వీటిల్లో వృక్ష సంబంధ ఒమేగా 3 కొవ్వు ఆమ్లం దండిగా ఉంటుంది. అంతేనా? పీచు, ప్రొటీన్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటివీ ఎక్కువే. ఇవన్నీ క్యాన్సర్‌, ఊబకాయం, మధుమేహం, పెద్దపేగు క్యాన్సర్‌, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌, గుండెజబ్బుల వంటి ఎన్నెన్నో సమస్యలు దరిజేరకుండా కాపాడతాయి. అక్రోట్లతో విషయగ్రహణ సామర్థ్యమూ మెరుగవుతుంది. సంతాన సమస్యలు అనగానే ఆడవాళ్ల మీదే దృష్టి సారిస్తుంటారు గానీ మగవారి గురించి పెద్దగా పట్టించుకోరు.
నిజానికి ఈ విషయంలో మగవారికి అక్రోట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. రోజూ అక్రోట్లను తినే మగవారిలో వీర్యం నాణ్యత మెరుగుపడి, సంతానం కలగటానికి తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.



మంచి ఉద్యోగం సంపాదించాలన్న ఆశయం ఉండాలే కానీ అవకాశాలు వస్తూనే ఉంటాయి. నిత్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నోటిఫికేషన్లు జారీ చేస్తూనే ఉంటాయి. వాటితో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగాల భర్తీ చేపడుతుంటాయి. ఇటీవల అనేక జాబ్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వాటిలో కొన్ని నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 31 చివరి తేదీ. మొత్తం 8 నోటిఫికేషన్లలో 3,448 ఖాళీలున్నాయి. వాటి వివరాలు తెలుసుకోండి.
మొత్తం 186 ఖాళీల భర్తీకి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్-CCRAS దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. గ్రూప్ ఏ, గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. పూర్తి వివరాలను http://www.ccras.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ.
http://www.ccras.nic.in/మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్-APSLPRB అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 50 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ. పూర్తివివరాలు తెలుసుకోవడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL అప్రెంటీస్ పోస్టుల భర్తీ చేపట్టింది. మొత్తం 176 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిషా, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో పోస్టింగ్ ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ఆగస్ట్ 31 చివరి తేదీ. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి
భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే-NFR భారీగా అప్రెంటీస్ పోస్టుల భర్తీ చేపట్టింది. మొత్తం 2590 పోస్టుల్ని ప్రకటించింది. ఫిట్టర్, కార్పెంటర్, మెకానికల్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, టర్నర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు 2019 అక్టోబర్ 31 చివరి తేదీ. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-IGNOU ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 65 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF, రీసెర్చ్ అసోసియేట్-RA పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో. మొత్తం 35 ఖాళీలున్నాయి. ఏరోస్పేస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎంబెడ్డెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషీన్స్, కంట్రోల్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఆప్టికల్ ఇంజనీరింగ్, మెకానికల్ లాంటి విభాగాల్లో ఎంటెక్ లేదా ఎంఈ చేసినవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI యంగ్ ప్రొఫెషనల్స్, అసిస్టెంట్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 30 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC బాటనిస్ట్, లీగల్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 88 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ.



ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ పనులు గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. ఉపాధి లేక కూలీలు ఇబ్బంది పడుతున్నారు. దీనంతటికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉండటం. దీంతో అధకార పక్షం ఇసుక సరఫరాలో విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. టీడీపీ ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్త ఆందోళ‌న‌కు పిలుపునిచ్చింది. జ‌న‌సేన విశాఖ‌లో లాంగ్ మార్చ్ చేయాల‌ని నిర్ణ‌యించింది.

అయితే, వ‌ర‌ద‌ల కార‌ణంగా కొంత కొర‌త ఉంద‌ని, అధిగ‌మించేందుకు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వం అంటోంది. అస‌లు ఇసుక స‌మ‌స్య‌కు కార‌ణాలు ఏంటి... దీనికి మూలాలు ఎక్కడ?

అపార వనరులు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇసుక ల‌భ్య‌త‌కు అన్ని ర‌కాలుగా అవ‌కాశాలున్నాయి. ముఖ్యంగా గోదావ‌రి, కృష్ణా, పెన్నా, తుంగ‌భ‌ద్ర వంటి న‌దీ తీరాల‌లోనూ, అన్ని కాలువ‌ల ద్వారానూ ఇసుక ల‌భిస్తోంది. నాణ్య‌మైన ఇసుక ల‌భిస్తుండ‌డంతో ఇక్కడి నుంచి తెలంగాణకు కూడా ప‌లు రీచ్‌ల నుంచి ఇసుక స‌ర‌ఫ‌రా అయ్యేది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది.

గ‌డిచిన ఐదు నెల‌లుగా ఇసుక కొరత తీవ్రమైంది. భవన నిర్మాణ పనులు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి వరద ఒక కారణమైతే, వైసీపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ మరో కారణమని తెలుస్తోంది.

రెండు ప్రభుత్వాలు.. అనేక విధానాలు
ఇసుక విష‌యంలో గ‌త ప్ర‌భుత్వం కూడా ప‌లు ప్ర‌యోగాలు చేసింది. ఇసుక‌ ఉచితంగా సరఫరా చేయడంతో పాటు డ్వాక్రా గ్రూపుల ద్వారా త‌వ్వ‌కాలు చేపట్టింది. అయితే, ఇసుక త‌వ్వ‌కాల‌ను కొంద‌రు త‌మ చెప్పుచేత‌ల్లో పెట్టుకుని, పెద్ద స్థాయిలో అక్ర‌మార్జ‌న‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇసుక మాఫియా వ్య‌వ‌హారం రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అప్పుడు అధికార పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు నేరుగా ఇసుక వ్య‌వ‌హారాల్లో భాగ‌స్వాముల‌యిన‌ట్టు ఆరోపణలు వచ్చాయి. నాటి దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఇసుక వ్యవహారంలో త‌హాశీల్దార్ వ‌న‌జాక్షి మీద దాడికి దిగడం చర్చనీయాంశమైంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక విధానంలో మాఫియాకు, అవినీతికి ఆస్కారం లేకుండా పార‌ద‌ర్శ‌క‌త కోస‌మంటూ ఇసుక త‌వ్వ‌కాల అనుమ‌తి విష‌యంలో జాప్యం చేసింది.

మే నెలాఖ‌రులో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం సెప్టెంబ‌ర్ 5 వ‌ర‌కూ ఇసుక త‌వ్వ‌కాలు నిలిపివేసింది. ఆ తర్వాత ఆన్ లైన్ ప‌ద్ధ‌తిలో ఇసుక బుకింగ్‌కు శ్రీకారం చుట్టింది. ఇసుక అవ‌స‌రమైన వారు ట‌న్నుకు రూ.375 చొప్పున బ్యాంకులో చ‌లానా తీసి, ఆధార్ కార్డు, నిర్మాణాల కోసం ప్ర‌భుత్వం ఇచ్చిన అనుమ‌తి ప‌త్రాల‌ను తీసుకుని రెవెన్యూ కార్యాల‌యంలో స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

దానికి ముందుగా వెబ్ సైట్ లో రిజిస్ట‌ర్ చేసుకుంటే ఓ నెంబ‌ర్ వ‌స్తుంది. వాటిని ఆధారం చేసుకుని ఇసుక త‌వ్వ‌కాలు జ‌రుగుతున్న ప్రాంతాల్లోని త‌హాశీల్దార్ ఆఫీసుకి వెళితే అక్క‌డ వారు ర్యాంప్ కేటాయిస్తారు. ఆ ర్యాంపు ద‌గ్గ‌ర ఉన్న ఏపీఎండీసీ సిబ్బంది ప‌రిస్థితిని బ‌ట్టి ఇసుక లోడుకి అనుమ‌తిస్తున్నారు. ఇసుక త‌ర‌లింపు కోసం దూరాన్ని బ‌ట్టి ఛార్జీ వ‌సూలు చేస్తారు.

ఇలా కూడా సమస్యలే
ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న విధానం వల్ల తీవ్ర స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని, ఇసుక కోసం ర్యాంపుల చుట్టూ తిర‌గాల్సి వ‌స్తోంద‌ని భవన నిర్మాణదారు టి. శ్రీనివాస్ చెప్పారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''ఇసుకను గ‌తంలో క‌న్నా త‌క్కువ ధ‌ర‌కు ఇస్తామ‌ని చెప్పారు. గ‌తంలో రూ. 2,500 ఇస్తే జిల్లాలో ఎక్కడికైనా ట‌న్ను ఇసుక వచ్చేది. కానీ ఇప్పుడు బ్యాంకుల చుట్టూ చ‌ల‌నా కోసం తిర‌గ‌డం, ఆ త‌ర్వాత త‌హాశీల్దార్ ఆఫీసుల చుట్టూ తిర‌గ‌డానికే స‌రిపోతోంది. వారం రోజులు పైగా ప‌ని మానుకోని తిరిగితేగానీ ఇసుక దొర‌క‌డం లేదు. ఇసుక 15 రోజుల‌కు వ‌స్తుందో, నెల‌కు వ‌స్తుందో కూడా గ్యారంటీ లేదు. మా ద‌గ్గ‌ర‌కు ఇసుక వచ్చేసరికి ట్రిప్పుకే రూ. 4,500 అవుతుంది. లారీ వాళ్లు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. క‌న‌స్ట్ర‌క్ష‌న్స్ మొద‌లెట్టిన మా లాంటి వాళ్ల స‌మస్య‌ల గురించి ప్ర‌భుత్వం ఆలోచించాలి'' అని తెలిపారు.

నిర్మాణాలు నిలిచిపోయి.. ఉపాధి పోయి
ఇసుక ల‌భ్య‌త నిలిచిపోవ‌డంతో భ‌వ‌న నిర్మాణ కార్మికుల ఉపాధికి విఘాతం క‌లిగింది. ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం రాష్ట్రంలో 30 ల‌క్ష‌ల మంది భ‌వ‌న నిర్మాణ కార్మికులున్నారు. వారితో పాటుగా భ‌వ‌న నిర్మాణ అనుబంధ రంగాలైన ఇటుక త‌యారీ, కంక‌ర క్వారీలు, మెటీరియ‌ల్ ర‌వాణా లారీలు స‌హా వివిధ రంగాల్లో మ‌రో 20 ల‌క్ష‌ల మంది కార్మికులు ఆధార‌ప‌డి ఉంటార‌ని అంచ‌నా. ఇసుక కొరత మూలంగా 3 నెల‌ల పాటు పూర్తిగా ఉపాధి నిలిచిపోయింద‌ని భ‌వ‌న నిర్మాణ మేస్త్రీ కంచుమ‌ర్తి కాటంరాజు బీబీసీకి తెలిపారు.

''భవ‌న నిర్మాణాల‌కు సీజ‌న్ లేకపోవడం అంటూ ఉండ‌దు. వేస‌విలో నిర్మాణాలు చేస్తే, వ‌ర్షాల స‌మ‌యంలో ఫినిషింగ్ వ‌ర్క్ చేస్తాం. కానీ, ఇప్పుడు గ‌తంలో ప‌నికి వెళ్లిన వారిలో నూటికి ఐదుగురికి కూడా ప‌ని దొర‌క‌డం లేదు. దాంతో ప‌నుల్లేక చాలా అవ‌స్థ‌లు ప‌డాల్సి వ‌స్తోంది. ఒక్క మేస్త్రీలకే కాకుండా కూలీలు, కార్పెంట‌ర్లు, ఎల‌క్ట్రిక‌ల్ వ‌ర్క‌ర్లు, రాడ్ బెండింగ్ , సెంట్రింగ్ వ‌ర్క‌ర్లకి కూడా ప‌నుల్లేకుండా పోయింది. ఇలాంటి ప‌రిస్థితి గ‌తంలో ఎన్న‌డూ లేదు'' అని చెప్పారు.

తూర్పు గోదావ‌రి జిల్లా పిఠాపురంలో ఫాల్జీ బ్రిక్ యూనిట్ న‌డుపుతున్న బి వెంక‌ట్ కూడా ఇలాంటి అభిప్రాయ‌మే వ్య‌క్తం చేశారు. ''గతంలో నేను ఇదే సీజ‌న్‌లో నెల‌కు 1.8 ల‌క్ష‌ల ఇటుకలు త‌యారీ చేశాను. కానీ ఇప్పుడు 10 వేలు కూడా అమ్ముడు పోవ‌డం లేదు. మా యూనిట్‌లో 12 మంది కార్మికులు ప‌నిచేసేవారు. ఇప్పుడు ఒక్క‌రు మాత్ర‌మే ప‌నిచేయ‌డానికి అవ‌కాశం ఉంది. మాలాంటి అన్ని యూనిట్ల‌లోనూ ఇదే ప‌రిస్థితి. అప్పులు చేసి గ‌డుపుతున్నాం'' అని అన్నారు.

లారీల య‌జ‌మానుల‌క‌యితే మ‌రింత స‌మ‌స్య‌గా ఉంద‌ని గుంటూరు జిల్లా ఉండ‌వ‌ల్లికి చెందిన లారీ య‌జ‌మాని ర‌వీంద్ర అంటున్నారు. లారీల‌కు కిస్తీలు కూడా క‌ట్ట‌లేక‌పోతున్నామని, నాలుగు నెల‌ల‌కు పైసా ఆదాయం లేదని చెప్పారు. ''మూడు లారీలున్నాయి. రెండు నెల‌ల పాటు పూర్తిగా మూల‌న‌ప‌డ్డాయి. ఇప్పుడు నెల‌కు 10 రోజులు తిప్పుతున్నాం. రోజుకి ఒక ట్రిప్పు వేస్తే రూ. 2 వేల లోపు ఆదాయం వ‌స్తోంది. బ్యాంకుల‌కు అప్పులు కూడా క‌ట్ట‌లేక స‌త‌మ‌త‌మ‌యిపోతున్నాం'' అంటూ వాపోయారు.

ప్రభుత్వం ఏమంటోంది?
అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా ఇసుక ల‌భించ‌డం లేద‌ని ప్ర‌భుత్వం కూడా అంగీక‌రిస్తోంది. స‌మ‌స్య‌ను అధిగమించేంద‌కు ప్ర‌య‌త్నిస్తున్నాంటున్నారు. అధికారిక వివ‌రాల ప్ర‌కారం ఏపీలో మొత్తం 151 ఇసుక రీచులున్నాయి. వాటిలో 36 రీచుల‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు లేక‌పోవ‌డంతో ప్ర‌స్తుతం 115 రీచులు ఇసుక త‌వ్వ‌కాల‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో 79 రీచుల‌కు వ‌ర‌ద తాకిడి కార‌ణంగా ఇసుక త‌వ్వ‌కాల‌కు అవ‌కాశం లేకుండా పోయింద‌ని ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వెల్ల‌డించారు.

ఇసుక స‌మ‌స్య‌పై ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి స‌ల్మాన్ ఆరోఖ్య రాజ్ మాట్లాడుతూ, ''రాష్ట్రంలో రోజుకి 80 నుంచి 85 ట‌న్నుల ఇసుక అవ‌స‌రం అవుతుంది. అది నిర్మాణాలు పుంజుకుంటే ల‌క్ష ట‌న్నులకు చేరుతుంది. అయితే ప్ర‌స్తుతం ఏపీఎండీసీ స్టాక్ పాయింట్ల ద్వారా 45 టన్నుల ఇసుక అందిస్తున్నాం. న‌దుల్లో వ‌ర‌ద నీరు త‌గ్గితే అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా అందించ‌గ‌లం. ర్యాంపుల‌న్నీ అందుబాటులోకి వ‌స్తే స‌మ‌స్య తీరుతుంది. ప్ర‌స్తుతం తాత్కాలికంగా ఏరులు, వాగులు, వంక‌ల్లో కూడా ఇసుక త‌వ్వ‌కాల‌కు అనుమ‌తిచ్చాం. త‌ద్వారా స్థానికంగా ఇసుక అవ‌స‌రం అయినా వారికి అది చేరుతుంది. అందుకు అనుగుణంగా మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చి అందుబాటులోకి తీసుకొచ్చాం'' అని పేర్కొన్నారు.

'వరద నీటి వల్లే'
గ‌త ప‌దేళ్లుగా ఎన్న‌డూ లేని రీతిలో ఈసారి వ‌ర్షాల కార‌ణంగా దాదాపు అన్ని న‌దుల‌కు వ‌ర‌ద తాకిడి క‌నిపిస్తోంది. గోదావ‌రి, కృష్ణా న‌దుల్లో గ‌డిచిన 70 రోజులుగా వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హిస్తోంది. దాని కార‌ణంగానే ఇసుక స‌మ‌స్య వ‌స్తోంద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. వ‌ర‌ద కార‌ణంగా 70 రీచులలో త‌వ్వ‌కాల‌కు అవ‌కాశం లేకుండా పోయిందని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు.

''నూతన ఇసుక పాలసీ ప్రకటించిన తరువాత ప్రారంభంలో 5 వేల టన్నుల ఇసుక సరఫరాకు అవకాశం ఉండగా, దాన్ని ఇప్పుడు 45 వేల టన్నులకు పెంచగలిగాం. వరద ప్రవాహం వల్ల నదులు, వాగుల్లో ఇసుక తవ్వే అవకాశం లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా పట్టా భూముల్లో మేట వేసిన ఇసుకను సేకరిస్తున్నాం. ఇందుకోసం టన్నుకు రూ.100 చొప్పున చెల్లిస్తామని భూయజమానులతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఇప్పటికే 82 మంది పట్టా భూముల యజమానులు ఇసుక తవ్వకాల కోసం ఒప్పందాలు చేసుకున్నారు. 10 పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి కూడా ఇచ్చాం. మరో 15 రోజుల్లో ఇసుక కొరత లేకుండా అడిగిన వారందరికీ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం'' అని తెలిపారు.

గత 30-40 రోజుల్లో ఇసుక కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారికి 6 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక సరఫరా చేశామని మంత్రి వెల్లడించారు. రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడాయ్‌) ప్రతినిధులతో మాట్లాడి వారి అవసరాలకు మరో 50 వేల టన్నుల ఇసుక అందించామని చెప్పారు.

'ఇది ప్ర‌భుత్వ వైఫ‌ల్యం'
ఇసుక విష‌యంలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యం మూలంగానే కార్మికులు, భ‌వ‌న య‌జ‌మానులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని టీడీపీ, జ‌న‌సేన స‌హా వివిధ ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత‌ల మీద క‌క్ష‌తో వైసీపీ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోందని, ఇసుక ర్యాంపుల నుంచి టీడీపీ శ్రేణుల‌ను దూరం చేయ‌డం కోస‌మే మూడు నెల‌ల పాటు మూత వేశారని చెప్పారు.

no image
Know your school MDM Bill status/Mandal MDM Bill status/ /Find MDM Bill Status /Mid Day Meals Bill Claim Status.

Know your school MDM Bill status/Mandal MDM Bill status/  Find MDM Bill Status Mid Day Meals Bill Claim Status. Mid Day Meals Bills every month are claimed by the Schools for the expenditure incurred as per the attendance. The MDM Bills are sent to the MRCs and the Bills are prepared by MRC and sent to the Treasury Officials for approval. The approved Bills are then credited in cash to the respective Cooker Cum Helper Dwackra Group Accounts.
 All the Schools in Andhra Pradesh can find the MDM Bill Claim Status of their Schools. Find MDM Bill Status Mid Day Meals Bill Claim Status

know school MDM Bill status


మీరు పీఎఫ్ ఖాతాదారులా? మీరు UAN నెంబర్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. పీఎఫ్ ఖాతాదారులను ఉద్యోగి భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) హెచ్చరిస్తోంది. పీఎఫ్ ఖాతాదారులు ఎట్టిపరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత వివరాలను షేర్ చేయరాదు. ప్రత్యేకించి ఫోన్ ద్వారా మీ ఆధార్, పాన్ కార్డు, Bank, UAN వివరాలను ఇవ్వరాదని పీఎఫ్ సంస్థ హెచ్చరిస్తోంది. ఈపీఎఫ్ఓ నుంచి ఎలాంటి కాల్స్ గానీ, మెసేజ్ లు వచ్చినా స్పందించరాదని తెలిపింది. ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన కాల్స్ లో మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ చేయమని అడిగితే వెంటనే EPFOకు రిపోర్టు చేయాల్సిందిగా పేర్కొంది. ఈపీఎఫ్ఓ సంస్థ నుంచి ఖాతాదారులకు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయమని ఎలాంటి ఫోన్ కాల్స్ రావని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఫోన్ ద్వారా మీ బ్యాంకు లేదా UAN, PAN కార్డు, ఆధార్ వివరాలను EPFO ఎన్నడూ అడగదు. ఏ బ్యాంకులో కూడా డబ్బులు జమ చేయమని EPFO ఎప్పుడూ ఫోన్ కాల్ చేయదు. ఇలాంటి ఫేక్ కాల్స్ విషయంలో ఖాతాదారులు స్పందించక పోవడమే మంచిది' అని ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ సైట్లో, ట్విట్టర్ లో వెల్లడించింది. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ సైట్ ( EPFO/UAN ) లో లాగిన్ అయి పీఎఫ్ సంబంధిత పనులను ఆన్ లైన్ లో పూర్తి చేసుకోవచ్చు.
గతంలో కూడా పీఎఫ్ సంబంధిత మోసాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. పీఎఫ్ ఖాతాదారులే లక్ష్యంగా వారి వివరాలను తస్కరించేందుకు మోసగాళ్లు ప్రయత్నిస్తుంటారు. గత ఏడాది ముంబైలో ఇలాంటి మోసపూరిత కాల్స్ వచ్చినట్టు సంస్థ గుర్తించింది. గూగుల్ సెర్చ్ లో కూడా మోసగాళ్లు ఈపీఎఫ్ నెంబర్ల మాదిరిగా కనిపించేలా ఉంచుతారు. ఇలాంటి ఫోన్ నెంబర్ల విషయంలోనూ ఖాతాదారులు జాగ్రత్త వహించాలని సూచిస్తోంది.
12 సంఖ్యల గల ఏకైక UAN నెంబర్ ను తమ ఖాతాదారులకు EPFO కేటాయిస్తుంది. పీఎఫ్ అకౌంట్ యాక్టివ్ గా ఉన్న ఖాతాదారుల కోసం జూలై 31, 2014 నుంచి నవంబర్ 30, 2016 మధ్య కాలంలో UAN నెంబర్ విధానాన్ని సంస్థ అమల్లోకి తీసుకొచ్చింది. డిసెంబర్ 2016 నుంచి పీఎఫ్ ఖాతాదారులకు UAN నెంబర్ కేటాయించడం జరుగుతోంది. ఆధార్ నెంబర్ ద్వారా UAN నెంబర్ ను యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆన్ లైన్ ద్వారా పీఎఫ్ అకౌంట్లోని నగదును విత్ డ్రా చేసుకునేందుకు వీలు ఉంటుంది.


రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం మరో కొత్త పంథాకు శ్రీకారం చుట్టనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను చాలా పకడ్బందీగా నిర్వహించనుంది. ఇందుకోసం సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఆటోమేషన్ విధానంలో జరిగే ఈ టెస్ట్‌లో ఉతీర్ణత సాధిస్తేనే లైసెన్సు దక్కుతుంది. అంతేకాకుండా ఈ టెస్ట్ మొత్తం వీడియో రికార్డు ప్రక్రియ ద్వారానే జరుగుతుంది. ఇప్పటికే ఆటోమేషన్ విధానంలో లైసెన్సుల జారీ ప్రక్రియ గుజరాత్, మహారాష్ట్ర, కేరళ సిటీలతో పాటు హైదరాబాద్‌లో కూడా అమలవుతోంది. అక్కడ 'సాఫ్ట్' ట్రాక్‌ల పేరుతో ఈ విధానం అమల్లో ఉండగా.. ఇప్పుడు ఏపీలో కూడా వచ్చే ఏడాది నుంచి ఈ విధానం అందుబాటులోకి రానుంది.
అంతేకాకుండా అధునాతన సైంటిఫిక్ టెస్ట్ ట్రాక్‌ల నిర్మాణం కోసం ఇప్పటికే రవాణా శాఖ టెండర్లను ఖరారు చేసినట్లు సమాచారం.

INNER POST ADS 2

TOP-LEFT ADS